Sajjala | 2014 ఎన్నికల్లో ఇదే కూటమి పోటీ చేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. అప్పుడు ఎంత రాచి రంపాన పెట్టారో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలో ఆయన మీడియా మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎందుకు లొంగిపోయారో ఆలోచించుకోవాలని సూచించారు.
చంద్రబాబు నాటకంలో పవన్ది చిన్న పాత్ర మాత్రమేనని సజ్జల ఎద్దేవా చేశారు. మేం అధికారంలోకి రాబోతున్నామని తెలిసే వాళ్లకు కోపం పెరుగుతుందని విమర్శించారు. కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీకి వేయించేందుకు పవన్ కల్యాణ్ విశ్వప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు అప్పజెప్పాలని అనుకుంటున్నారని నిలదీశారు. కూటమిలో అందరూ చంద్రబాబు మనుషులే అని ఆయన స్పష్టం చేశారు.