Pothina Mahesh | పవన్ కల్యాణ్ ఈసీకి సమర్పించిన అఫిడవిట్పై జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్ మండిపడ్డారు. అఫిడవిట్లో పవన్ కల్యాన్ అన్నీ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఓ అధికారిని పెట్టి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ చూపిన ఆస్తులు, లావాదేవీల్లో లాజిక్ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు జనసేన పార్టీని హోల్సేల్గా అమ్మేశారని ఆరోపించారు. రెండు చిత్రాలతో పవన్ కల్యాణ్ రూ.90 కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. ఆ డబ్బులు సినిమా రెమ్యునరేషనా? లేక పొలిటికల్ ప్యాకేజీతో వచ్చాయా అని నిలదీశారు.
భూములు దోచుకోవాలని, లక్షల కోట్ల రూపాయలు సంపాదించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని పోతిన మహేశ్ ఆరోపించారు. అందుకే సీఎం అభ్యర్థి నుంచి పార్టీకి కేవలం 21 సీట్లు ఇస్తే చాలన్న స్థాయికి పడిపోయారని విమర్శించారు. పవన్కు ప్రజల నుంచి చెప్పు దెబ్బలు తప్పవని అన్నారు. సినిమా డైలాగులు చెబితే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం ఏంటని ప్రశ్నించారు.
ప్రజలను నమ్ముకున్న సీఎం జగన్ సింగిల్గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు. జగన్ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఏపీలో ప్రజలు కూటమిని నమ్మడం లేదని.. మరో 25 ఏండ్లు సీఎంగా జగనే ఉంటారని స్పష్టం చేశారు.