(JP Agraharam farmers) విశాఖ : చోడవరం ఎమ్మెల్యే వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ముందుకు వెళ్లకుండా ఆమె కారుకు అడ్డంగా కూర్చున్నారు. దాంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. తమను సాగుదారులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
విశాఖ పరిధిలోని రోలుగుంట మండలం జేపీ అగ్రహారం రైతులు ధర్నా చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వాహనాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు తమను సాగుదారులుగా గుర్తించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని జేపీ అగ్రహారం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..