ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
టేకుమట్ల, ఏప్రిల్ 3 : గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంలో దూసుకుపోతున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశా రు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ అంబులెన్స్, రామకృష్ణాపూర్(టీ)లోని పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మార్సీ భవనంలో జరిగిన మండల సర్వస భ్య సమావేశానికి గండ్ర హాజరై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టేకుమట్ల నూతన మండలంగా ఏర్పడడంతో ప్రజలకు సులభతరం అయిందన్నారు.
పట్టణాలకు దీటుగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పార్కులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. పరిశుభ్రమైన రోడ్లు, పచ్చని మొక్కలతో గ్రామాలు నూతన శోభను సంతరించుకున్నాయన్నారు. ప్రభుత్వం సంకల్పం నెరవేరడం కోసం ప్రజా ప్రతినిధులు, అధికారుల కృషి మరువలేనిదని తెలిపారు. ఇదే పట్టుదలతో అన్ని శాఖల అధికారులు పనులు చేస్తూ మరింత అభివృద్ధి సాధించాలన్నారు. సమావేశంలో ఎంపీపీ మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ పోతనవేని ఐలయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు గునిగంటి మహేందర్ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా ఉద్యాన అధికారి అక్బర్, తహసీల్దార్ షరీపొద్దీన్, ఎంపీడీవో చండీరాణి, ఏపీవో మాధవి, ఏవో శ్రీనివాస్రెడ్డి, ఏఈ తారాచంద్ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
ఉత్తరాఖండ్లో జర్నలిస్టులందరికీ కరోనా టీకా
గాయమైన కాలును మమత ఊపుతున్న వీడియో వైరల్