(Teacher Suicide) కర్నూలు: జిల్లాలో ఓ ప్రభుత్వ అధ్యాపకురాలు ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు లేరని భర్త నిత్యం పెట్టే వేధింపులకు విసిగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది. భర్తపై ఆత్మహత్య కేసు నమోదు చేసి కర్నూలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు పాతబస్తీ బాపూజీనగర్కు చెందిన 28 ఏండ్ల ఏ భారతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ప్రస్తుతం సీ బెళగల్ మండలం ఇనకండ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. స్థానిక గాంధీనగర్ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మేనల్లుడు గోపీకృష్ణతో ఎనిమిదేండ్ల క్రితం భారతి వివాహం జరిగింది. వారికి ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. ఇదే విషయమై ఆమెను గోపీకృష్ణ నిత్యం వేధించేవాడు.
భర్త కించపరచడాన్ని భరించలేని భారతి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్పృహతప్పి పడివున్న భారతిని గమనించిన కుటుంబ సభ్యులు.. స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త వేధింపుల వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకున్నదని మృతురాలి అక్క సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, కర్నూలు పట్టణ పోలీసులు గోపీకృష్ణపై ఆత్మహత్య చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..