AP Capital | ఏపీ రాజధాని అమరావతి అంశంపై ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీంకోర్టులో సోమవారం ప్రస్తావనకు వచ్చింది. ఈ కేసును వీలైనంత తొందరగా పరిష్కరించాలని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ నాగరత్న ద్విసభ్య ధర్మాసనాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల తరఫు న్యాయవాదులు ఈ సందర్భంగా న్యాయస్థానానికి తెలిపారు.
కౌంటర్ దాఖలు చేయడానికి నేటి నుంచి రెండు వారాల సమయం కావాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని రైతుల తరఫు న్యాయవాదులు కోరారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా అంగీకారం తెలపడంతో రాజధాని అంశంపై ఈ నెల 23న విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలని రైతుల తరఫు న్యాయవాదులను ఆదేశించింది. అలాగే ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలని సూచించింది.
రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గత ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ 2023-24 లైవ్ అప్డేట్స్
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ బడ్జెట్ | వ్యవసాయానికి రూ.26,831 కోట్లు
ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ : మంత్రి హరీశ్రావు