Dharmana | టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మొట్టమొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని ఆరోపించారు. ఆయన పేల్చేలోపు మనమే చంద్రబాబుపై తుపాకీ పేల్చాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ మంత్రి ధర్మాన పాల్గొని ప్రసంగించారు. వాలంటీర్లపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు ఉన్నారని ఏపీ మంత్రి ధర్మాన అన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాల గురించి వివరించే హక్కు వాళ్లకు ఉందని తెలిపారు. ఈ పథకం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని వాళ్లకు వివరించి.. ప్రజలను సరైన మార్గంలో నడిపించాలని ధర్మాన సూచించారు. ఏ పార్టీకి ఓటు వేయాలి? ఏ పార్టీ మంచిదో వాలంటీర్లు చెప్పకూడదని ఎవరన్నారని ప్రశ్నించారు. ఏ పార్టీకి ఓటు వేయాలో చెప్పే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని చెప్పిన ధర్మాన.. వాలంటీర్ కూడా ఒక పౌరుడేనని గుర్తు చేశారు. మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే అధికారం.. మంచి ప్రభుత్వం గురించి ప్రచారం చేసే అవకాశం, మంచి కార్యక్రమం గురించి చెప్పే హక్కు వాలంటీర్లకు ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వస్తే మొట్టమొదట తుపాకీ పేలేది వాలంటీర్లపైనే అని హెచ్చరించారు. ఆయన పేల్చేదాకా ఎందుకు ఆగడం.. మనమే పేలుస్తే అయిపోతుంది కదా అని.. మన దగ్గర కూడా తుపాకీ ఉందని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
ఇక ఏపీలో నిత్యవసర వస్తువులు పెరిగాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా ఏపీ మంత్రి ధర్మాన నిప్పులు చెరిగారు. ధరలు పెరిగాయని గగ్గోలు పెడుతున్నారు.. ఇక్కడ ఒక్కచోటే పెరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. దేశమంతటా ధరలు పెరిగాయని గుర్తు చేసిన ఆయన.. దేశం మొత్తం జగన్మోహన్రెడ్డి పాలనే లేదు కదా అని సెటైర్ వేశారు. ధరలు పెరిగిన మాట నిజమే అని.. ఒక్క ఏపీలోనే కాదు ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అంతటా ఇవే ధరలు ఉన్నాయని అన్నారు. దేశమంతటా పెరిగిన ధరలకు మనం ఏం చేస్తామని ప్రశ్నించారు.
Forbes | ఫోర్బ్స్ జాబితాలో కోనసీమ కుర్రాడు.. 30 ఏళ్లలోపే అరుదైన గుర్తింపు
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ 2023-24 లైవ్ అప్డేట్స్
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ బడ్జెట్ | వ్యవసాయానికి రూ.26,831 కోట్లు
ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ : మంత్రి హరీశ్రావు