(Special Trains) హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. సంక్రాంతి పండక్కి నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ రైలు జనవరి 10 న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి జనవరి 11న ఉదయం 7:20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు అంటే జనవరి 12న ఉదయం 7:50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఈ రెండు ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయి. అలాగే, తిరుపతి నుంచి కాచిగూడకు ప్రత్యేక రైలు జనవరి 12వ తేదీ మధ్యాహ్నం 3.20 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.20 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాచిగూడ నుంచి తిరుపతికి 13 వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ II-టైర్, ఏసీ III-టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్-సిట్టింగ్ కోచ్లు ఉంటాయని ఎస్సీఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.
చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? గుండెనొప్పా?
కళ్లు పొడిబారుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..