YS Avinash | వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి కాల్ రికార్డు సంచలనంగా మారడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అవినాష్రెడ్డి కాల్ రికార్డ్స్లో సంచలనం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఏపీ సీఎం జగన్కు లింక్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
జగన్ ఇంట్లో నవీన్ అటెండర్గా పనిచేస్తున్నాడని సజ్జల తెలిపారు. జగన్ దగ్గర ఫోన్ లేదు కాబట్టి నవీన్కు ఫోన్ చేశారని అన్నారు. సమాచారం ఇవ్వడానికి సిబ్బంది కాల్ చేయడం సర్వసాధారణమని ఆయన అన్నారు. కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ ఈరోజు కూడా జగన్ దగ్గరే ఉన్నారని తెలిపారు. వివేకా చనిపోయిన విషయం జగన్కి కమ్యూనికేట్ చేసేందుకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. వివేక్ చనిపోయిన విషయాన్ని ఆయన బావమరిది అవినాష్ రెడ్డికి కమ్యూనికేట్ చేశారని.. అవినాష్ రెడ్డి జగన్కు చెప్పడం కోసం నవీన్, కృష్ణ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఫోన్ చేయాలన్నా.. ఎవరో ఒకరికి ఫోన్ చేయాల్సిందే కదా అని ప్రశ్నించారు. ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి తర్వాత నవీన్కు నోటీసులిస్తే.. నవీన్ ఎవరోనంటూ ఏదేదో ప్రచారం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. దీనిపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా గతంలో కృష్ణమోహన్రెడ్డితో పాటు వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో కడప కేంద్ర కారాగారంలో సీబీఐ విచారణకు శుక్రవారం వీరద్దరూ హాజరయ్యారు. ఈ నెల 28న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సీబీఐ.. ప్రధానంగా ఆయన కాల్డేటాపై ఆరా తీసింది. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో అతనితో పాటు కృష్ణ మోహన్రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది.
తిరుమలలో రూ. 50 కోట్లతో ఆటోమెటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు : టీటీడీ ఈవో