Kotamreddy Sridhar reddy | ఏపీ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విమర్శలకు దారితీస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కుమ్మక్కై కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కోటంరెడ్డిపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. వీటికి కోటంరెడ్డి కూడా అంతే దీటుగా సమాధానాలిస్తున్నారు. ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని.. అవమానించిన చోట ఉండకూడదనే అధికారం వదులకుంటున్నా అని స్పష్టం చేశారు.
మరో 10 నెలలకు పైగా అధికారంలో ఉండే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పరిణమాలు ఎలా ఉంటాయో తెలుసని కోటంరెడ్డి తెలిపారు. అలాగని ఇష్టం లేని చోట.. అవమానం జరిగిన పార్టీలో ఉండటం ఇష్టం లేకే దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిసి మనసు విరిగిపోయిందని.. అందుకే అక్కడ ఉండలేక ఆధారాలు చూపించి బయటకు వచ్చేశానని తెలిపారు. మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదని.. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు దొరికిన తర్వాతనే దూరం జరిగానని స్పష్టం చేశారు. మౌనంగానే వెళ్లిపోదామని అనుకుంటే వైసీపీ నేతలు తనపై ఆరోపణలు చేయడం వల్లే మళ్లీ మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్ ట్యాపింగ్ ఆషామాషీగా జరగదని కోటంరెడ్డి అన్నారు. ఈ ట్యాపింగ్ అధికారుల పని కాదు.. ప్రభుత్వ పెద్దల పనే అని ఆరోపించారు. ఏపీ మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తనపై చేసిన విమర్శలు బాధకలిగించాయని కోటంరెడ్డి అన్నారు. నా బిడ్డలు ఏం చేశారు? వాళ్లపై విమర్శలు ఎందుకు అని ప్రశ్నించారు. తాను మోసం చేసేవాణ్ని అయితే ఎన్నికల వరకు ఉండి చివరలో పార్టీ మారేవాడినని స్పష్టం చేశారు. అనిల్కుమార్ తొలిసారి ఓడిపోయినప్పుడు తను, తన భార్య, పిల్లలు భోజనం కూడా చేయలేదని తెలిపారు. తాను చంద్రబాబును కలిసినట్టు చేస్తున్న ప్రచారం అసత్యమని ఆయన పేర్కొన్నారు.
తిరుమలలో రూ. 50 కోట్లతో ఆటోమెటిక్ లడ్డూ యంత్రాల ఏర్పాటు : టీటీడీ ఈవో