(Sajjala) గుంటూరు : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రతిపక్షాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని, వీరి విమర్శలను పార్టీ శ్రేణులు బలంగా తిప్పికొట్టాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో సజ్జల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విస్తృత సమావేశాలు నిర్వహించి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సజ్జల పార్టీ శ్రేణులకు సూచించారు.
విస్తృత సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉన్నదని, ఈ పథకం ద్వారా ప్రజలకు అందనున్న ప్రయోజనాలను వివరించి చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి నాయకులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇది స్వచ్ఛంద పథకం అనే విషయాన్ని ప్రజలకు తెలియచేయాలన్నారు. పథకాలను నిలిపివేయడం గానీ, బెదిరింపులను సహించేది లేదని స్పష్టం చేయాలన్నారు. 1983 నుంచి 2011 వరకు రాష్ట్రంలో గృహనిర్మాణ సంస్థ ద్వారా నిర్మించిన గృహాల లబ్ధిదారులకు మేలు చేసేలా జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని ఆయన తెలిపారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..