(Vangaveeti Radha) అమరావతి: టీడీపీ నాయకుడు వంగవీటి రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరులో రంగా విగ్రహాన్ని మంత్రి కొడాలి నానితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ.. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నారని, అందుకోసం రెక్కీ కూడా నిర్వహించారని చెప్పారు. తనను చంపాలని చూసినా భయపడనని, దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు. తనపై రెక్కీ జరిపిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. ప్రజల మధ్యే ఉంటా.. వంగవీటి రంగా ఆశయసాధనే తన లక్ష్యమన్నారు.
అంతకుముందు విజయవాడలోని రాధా కార్యాలయంలో వంగవీటి రాధాతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కలిశారు. వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. భేటీ అనంతరం వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగా వర్ధంతి సందర్భంగా రాధా, వంశీలు కలుసుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..