రాజమండ్రి : (Papikondalu Tour) పాపికొండల బోట్ యాత్ర ఆదివారం ప్రారంభమైంది. రెండేండ్ల విరామం అనంతరం ఎంతో ఆనందోత్సవాల మధ్య విహారయాత్ర మొదలైంది. బోట్ యాత్రలో పాపికొండలకు వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. గోదావరి అందాలను తిలకిస్తూ పాపికొండలకు బయల్దేరుతుండటంతో వారు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాపికొండలకు బోట్ సౌకర్యాన్ని పునఃప్రారంభించడంతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొన్నది.
ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న పోశమ్మ గండి ఆలయం నుంచి రెండు బోట్లు పాపికొండలకు బయల్దేరాయి. పోశమ్మగండి నుంచి పాపికొండల వరకు యాత్ర కొనసాగుతుంది. రెండేండ్ల అనంతరం బోట్ విహారయాత్ర ప్రారంభం కావడంతో ఎంతో ఆసక్తికరంగా, ఉద్విఘ్నంగా పర్యాటకులు ఉన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సందర్శకులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బోట్లో వెళ్లే వారందరికీ తప్పనిసరిగా లైఫ్జాకెట్లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని పర్యాటకులకు సూచిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.
కచ్చులూరు బోటు ప్రమాదం జరిగిన దాదాపు రెండేండ్ల తర్వాత ఈ బోట్ యాత్ర తిరిగి మొదలు కావడంతో గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజమండ్రి నుంచి పాపికొండలకు ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజనంతో కలపి టికెట్ ధరను రూ.1,250 గా ప్రభుత్వం నిర్ణయించింది.
చెరువులో స్నానానికి దిగిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
సంక్రాంతికి ముందే జోరుగా కోడిపందేలు.. 32 మంది అరెస్ట్, 60 కోడిపుంజులు స్వాధీనం
తల్లి మరణవార్త విని కన్నుమూసిన ఏఎస్సై.. పెండ్లింట విషాదం
ఠారెత్తిస్తున్న టమాట.. రికార్డు స్థాయిలో 74 పలుకుతున్న ధర
ప్రభంజనంలా కొనసాగుతున్న రైతుల మహా పాదయాత్ర
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
జింక్తో జలుబు, దగ్గుకు చెక్ పెట్టొచ్చు..! వెస్ట్రన్ వర్శిటీ పరిశోధన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..