Lavanya | సంగారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన కలకలం రేపింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో నడి రోడ్డుపై హల్చల్ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మల్లేపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, లావణ్య మద్యం సేవించి కారు నడుపుతూ వెళ్తుండగా ఒక బైక్ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పటికీ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే స్పందించి ఆమె కారును అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా లావణ్య, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెతో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఆమె మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఆమె కారును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. తర్వాత లావణ్యను కొండాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే వ్యక్తిగత వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఆమె, ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో మరింత వివాదాస్పదంగా మారింది. కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్పై అనేక ఆరోపణలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక హీరో రాజ్ తరుణ్ విషయానికి వస్తే, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మామ’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందాడు. అయితే తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు.
మద్యం మత్తులో రాజ్తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్!!
సంగారెడ్డి ముత్తపల్లిలో బైక్ను ఢీకొట్టి పరారయ్యే ప్రయత్నం… గ్రామస్తులు అడ్డుకున్నారు.#Rajtharun #Lavanya pic.twitter.com/TSHZfnLAIq
— Milagro Movies (@MilagroMovies) March 25, 2026