(NV Ramana) అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తొలిసారి ఏపీ రాజధాని అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. కొవిడ్ నిబంధనలను అనుసరించి అమరావతి రైతు జేఏసీ రాయపూడిలో సీజేఐకి జాతీయ జెండాలతో స్వాగతం పలికింది.
హైకోర్టు ఆవరణలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. సీజేఐ దంపతులకు హైకోర్టు సిబ్బంది పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు త్వరలోనే కొత్త న్యాయమూర్తులను నియమించి ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ కీర్తిని ఇనుమడింపజేస్తానని మాట ఇస్తున్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని అనేక మందిని తాను కలిశానని.. తనపై కురిపించిన ప్రేమాభిమానాలు తనకు ఎల్లకాలం గుర్తుంటాయని ఎన్వీ రమణ పేర్కొన్నారు.
మూడు రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాసం కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుని, వెంకటేశ్వర్లు సతీమణి ఆశీస్సులు తీసుకున్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..