జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
శాయంపేట, మే 7: కార్యకర్తల కుటుంబాలకు టీఆర్ఎస్ అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మీరిపెల్లి కుమారస్వామి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అతడి కుటుంబానికి పార్టీ తరఫున వచ్చిన రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కును శుక్రవారం కుమారస్వామి భార్య విజయకు గండ్ర జ్యోతి అందజేశారు. కరోనా ఆపద కాలంలోనూ అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, ఉప సర్పంచ్ గోనె నాగరాజు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పంజాల కమలాకర్, మాజీ అధ్యక్షుడు మిరిపెల్లి కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు త్రిపురాల శ్రీనివాస్, గడ్డె రాజు, బుస్స సంపత్, చెన్నబోయిన అజయ్, గట్లకానిపర్తి సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య, మాందారిపేట మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్, బత్తిని సత్యం, ఆనందం తదితరులు పాల్గొన్నారు.