భీమదేవరపల్లి, ఏప్రిల్ 4 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు అంబేద్కర్ కూడలి వద్ద బీఆర్ఎస్ రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తరఫున ప్రచారం చేసేందుకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ హాజరవుతారని, రోడ్షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మండల అధ్యక్షుడు మండల సురేందర్ కోరారు.