(Minister Help) నెల్లూరు: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఔదార్యం ప్రదర్శించారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఓ బాలుడికి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేశారు. ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసి భవిష్యత్లో బాలుడికి ఉపయోగపడేలా చేయనున్నారు. అలాగే, ప్రభుత్వ పరంగా ఉచిత విద్య అందించేలా చర్యలు తీసుకుంటానని కూడాహామీ ఇచ్చారు.
వివరాల్లోకెళితే.. సంగం సమీపంలో ముంబై హైవేపై ఇటీవల జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు ఢీకొట్టడంతో బీరపేరు వాగులోకి ఆటోరిక్షా పడిపోయి ఐదుగురు ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ ఘటనలో నవదీప్ అనే బాలుడి తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. బాలుడికి జరిగిన అన్యాయాన్ని పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకున్న మంత్రి గౌతమ్రెడ్డి.. బుధవారం బాలుడిని ఓదార్చి రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేశారు.
ఆ మొత్తాన్ని బాలుడి పేరిట బ్యాంకులో డిపాజిట్ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నవదీప్కు ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగా ఉంటానని, అతడికి ఉచిత చదువు చెప్పించేలా అధికారులతో మాట్లాడుతానన్నారు. నవదీప్ కుటుంబంలోని ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పారు. ఆటోలోని కొందరు ప్రయాణికులను రక్షించడంలో, మృతదేహాలను గుర్తించడంలో సాయపడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక మత్స్యకారులను మంత్రి అభినందించారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..