(Peddireddy coments) అమరావతి: పేదలకు ఓటీఎస్ పథకంతో ఎంతో మేలు ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఓటీఎస్ పథకాన్ని విమర్శిస్తున్న వారిపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటీఎస్పై ప్రతిపక్షం ఒక వర్గం మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. గృహ నిర్మాణంలో సంస్కరణలు తీసుకురావాలన్న కృతనిశ్చయంతో సీఎం జగన్ ఈ ఓటీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారన్నారు. ఓటీఎస్ చేసుకోవడం ద్వారా పట్టా ఇచ్చి శాశ్వత హక్కు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న పట్టాలను తాకట్టు పెట్టుకుని రుణం తీసుకునేందుకు అన్నిరకాల హక్కులు వారికి ఉంటాయని వెల్లడించారు. పట్టణాల్లో దీనిపై అవగాహన ఉండటంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, పల్లెల్లో అవగాహన లోపాన్ని తమ స్వార్ధ రాజకీయాలకు ప్రతిపక్షాలు వాడుకుంటున్నయని దుమ్మెత్తి పోశారు.
2014 లో కూడా రుణమాఫీ చేస్తాం వడ్డీలు, అప్పులు కట్టవద్దని టీడీపీ నేతలు మహిళలకు మాయమాటలు చెప్పారని, అప్పటి రూ.14 వేల కోట్ల రుణాలు ఇప్పుడు రూ.25 వేల కోట్లు అయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ప్రజల నుంచి రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం ఓటీఎస్ బలవంతంగా చేయమనడంలేదని, స్వచ్ఛందగా చేసుకోవచ్చునని కూడా స్పష్టం చేసినట్లు గుర్తుచేశారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..