Adani | ఇంటర్ మాత్రమే చదివిన అదానీ( Gautam Adani )కి ష్యూరిటీ లేకుండా వేల కోట్ల రుణం ఎలా ఇచ్చారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ( Chinta Mohan ) ప్రశ్నించారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్బీఐ బ్రాంచి ముందు సోమవారం ఉదయం చింతా మోహన్ ఆందోళన చేపట్టారు.
మోదీ స్నేహితుడు అదానీకి రాజకీయ పలుకుబడితో రూ.30వేల కోట్ల రుణాన్ని కట్టబెట్టారని చింతామోహన్ ఆరోపించారు. అదానీ ఒక్కడి వల్ల దేశవ్యాప్తంగా 24వేల బ్రాంచులు ఉన్న ఎస్బీఐ దివాళా తీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను అదానీ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ను అదానీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా మార్చేయండి అంటూ ఎద్దేవా చేశారు. ఆదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ 2023-24 లైవ్ అప్డేట్స్
Telangana Budget | తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇలా..
తెలంగాణ బడ్జెట్ | వ్యవసాయానికి రూ.26,831 కోట్లు
ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ : మంత్రి హరీశ్రావు