అనంతపురం : (Nara Lokesh) ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలను సంరక్షించుకోవాలని, అందుకు ఎంత వరకైనా పోరాటం చేసేందుకు సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. విద్యార్థుల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 42ను వారం రోజుల్లోగా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న నారా లోకేశ్.. బుధవారం ఎస్ఎస్బీఎన్కళాశాల విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెల్సుకున్నారు.
విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కాపాడుకునేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఎత్తడం దుర్మార్గమన్నారు. విద్యార్థులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి హింసించడం దారుణమని అన్నారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా జీవో జారీ చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను దేశంలో ఎక్కడా రద్దు చేయలేదన్న విషయాన్ని ఏపీ ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు. ఎయిడెడ్ స్కూళ్ల భూములు కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..