శ్రీకాకుళం : (Dharmana) ఇంధన ధరలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. తమ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది పేదలకు మేలు చేకూర్చేలా ఉంటుందని, పెట్రోల్ ధరల విషయంలో కూడా ప్రజలకు మేలు చేశాలా నిర్ణయం తీసుకుంటామన్నారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ పన్నులను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. పెట్రో భారాన్ని తగ్గించాలంటూ విపక్షాల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నది.
వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను అశ్రద్ధ చేసిన టీడీపీ.. జగన్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడంలేదని తప్పుడు ప్రచారం చేస్తోందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ పాలనకు ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే రెఫరెండం అన్న కృష్ణదాస్.. రెండున్నరేండ్లల్లో రాబోతున్న ఎన్నికల్లో సరైన నాయకుడు ఎవరో ప్రజలే తెలుస్తారన్నారు. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేంద్ర ఎక్సైజ్ పన్నులను తగ్గించగానే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. దక్షిణాదిలోనే ఇంధనం ధరలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 గా ఉండగా.. విజయవాడలో రూ.110.35 గా ఉన్నది. అదే డీజిల్ ధర హైదరాబాద్లో రూ.94.62 గా ఉండగా.. విజయవాడలో రూ.96.44 గా ఉన్నది. సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం ప్రకటించడంతో ఏపీ ప్రభుత్వం ఎంత మేర తగ్గిస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.
తిరుపతిలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరికి గాయాలు
కాళేశ్వరంలో కార్తీక శోభ.. భారీగా తరలివచ్చిన భక్తులు
ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేండ్లు.. వైసీపీ శ్రేణుల సంబురాలు
రాజధాని తరలింపు నిర్ణయం చారిత్రక తప్పిదం: తులసిరెడ్డి
ప్రభంజనంలా ఏపీ రైతుల మహాపాదయాత్ర
శ్రీవారికి తమిళ భక్తుడి భూరి విరాళం.. 3 కేజీల బంగారు బిస్కెట్లు అందజేత
రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..