(Couple Died) చిత్తూరు: ఇంట్లో అగ్నికీలలు ఎగిసిపడిన ఘటనలో దంపతులు సజీవ దహనమయ్యారు. ఇదే ఇంట్లో ఉన్న వారి ముగ్గురు పిల్లలు అగ్నిప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పీలేరు పట్టణంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎర్రావారిపాలెం మండలం కోటకాడపల్లెకు చెందిన భుక్కే నాగేశ్వర నాయక్ (46), బీ సిద్ధేశ్వరి దంపతులు. వీరి వివాహం 20 ఏళ్ల క్రితం జరిగింది. పీలేరులోని సైనిక్ నగర్లో 17 ఏండ్లుగా నివాసముంటున్న వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాగేశ్వర నాయక్ శ్రీనగర్లో సీఆర్పీఎఫ్ జవాన్గా పనిచేస్తున్నాడు. కాగా, వారం క్రితం శ్రీనగర్ నుంచి పీలేరుకు వచ్చాడు. ఉదయం ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే నాగేశ్వర్ నాయక్ విగతజీవిగా మారిపోయాడు.
సిద్ధేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అగ్నిప్రమాదంలో దంపతులిద్దరూ చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. కుమారుడు విష్ణువర్ధన్ నాయక్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా.. కుమార్తెలు అంజలి టీటీసీ, శ్రీ చైతన్య బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పీలేరు రూరల్ సీఐ తులసీరాం నేతృత్వంలో ఎస్ఐ తిప్పేస్వామి దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..