APPSC | అమరావతి : గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా తేదీలను విడుదల చేసింది. ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్లో నిర్వహిస్తామని, ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం విదితమే. మొత్తం 1,48,881 మంది ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకోగా, 4,496 మంది మెయిన్స్కు అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.
మే 3 – క్వాలిఫైయింగ్ ఎగ్జామ్(తెలుగు)
మే 4 – క్వాలిఫైయింగ్ ఎగ్జామ్(ఇంగ్లీష్)
మే 5 – పేపర్ 1(జనరల్ ఎస్సే)
మే 6 – పేపర్ 2(ఇండియా, ఏపీ చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
మే 7 – పేపర్ 3( పాలిటీ)
మే 8 – పేపర్ 4( ఇండియా, ఏపీ ఎకానమి)
మే 9 – పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్)
ఇవి కూడా చదవండి..
Minister Gottipati | అదంతా తప్పుడు ప్రచారమే .. అస్సలు నమ్మొద్దు : ఏపీ మంత్రి గొట్టిపాటి
Janasena | ఏపీలో జనసేన కీలక నిర్ణయం.. కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ
Kolusu Parthasarathi | రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేకపోయిన వైసీపీ : మంత్రి కొలుసు పార్థసారథి