(AP Assembly) అమరావతి : తెలుగు రిపోర్టర్ల నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రారంభించింది. ఏపీ లెజిస్లేచర్ సర్వీస్లో తెలుగు రిపోర్టర్స్ పోస్టులు 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ఫారాలు కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఫారమ్లను సమర్పించడానికి చివరి తేదీ 2021 నవంబర్ 8.
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా హయ్యర్ గ్రేడ్ షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్ ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2021 జూలై 1 నాటికి అభ్యర్థులు 18-42 మధ్య వయస్సు కలిగి ఉండాలి. తెలుగు షార్ట్హ్యాండ్లో నిమిషానికి 80 పదాల వేగం కలిగి ఉండాలి.
అభ్యర్థులు రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. తప్పనిసరిగా అన్ని పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఏదేని ఒక పరీక్షకు గైర్హాజరు అయిన వారిని అనర్హులుగా ప్రకటిస్తారు. మరిన్ని వివరాలకు https://psc.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.
ప్రపంచ గుర్తింపు కాదు.. ముందు ప్రజల ప్రేమను గెలుచుకోండి : హమీద్ కర్జాయ్
నైజీరియాలో కాల్పులు, 43 మంది మృతి
చైనాలో మళ్లీ కరోనా జాడలు, పలు నగరాల్లో లాక్డౌన్
అమృత్సర్లో కెప్టెన్ పోటీ చేస్తే ఆయన ప్రజాదరణ తేలుతుంది: నవజ్యోత్ కౌర్
భారత వైమానిక దళానికి చేరిన తొలి స్వదేశీ మిగ్-21
చెమటతో రక్తంలో చక్కెరను కనిపెట్టొచ్చు.. డివైజ్ సిద్ధం చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు
వచ్చే ఏడాది ఐటీలో భారీగా కొలువులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..