(AP Panchayats) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ఆర్థిక ప్రోత్సాహక నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రోత్సాహక నిధులు అందజేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 వేలకు పైగా గ్రామాల్లో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 2,001 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 358 పంచాయతీలు, గుంటూరు జిల్లాలో 245, కడప జిల్లాలో 248, ప్రకాశంలో 192 పంచాయతీలు ఏకగ్రీవంగా ముగిశాయి. అనంతపురం జిల్లాలో 36 గ్రామాల్లో పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ గ్రామాలకు రూ.134.95 కోట్ల ప్రోత్సాహక నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోత్సాహకాలు రూ.5-10 లక్షల మధ్య ఉన్నాయి. 2 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షలు, 2వేలు–5వేల మధ్య జనాభా ఉన్న గ్రామాలకు రూ.10 లక్షలు, 5వేలు–10వేల జనాభా ఉన్న గ్రామపంచాయతీలకు రూ.15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు రూ.20 లక్షల ప్రోత్సాహక నిధులు అందించనున్నారు.
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..