(Maha Padayatra) ప్రకాశం : అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ఇవాళ 14వ రోజుకు చేరుకున్నది. ఆదివారం మరింత ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగుతున్నది. యరజర్ల శివార్లలో యాత్ర మొదలైంది. స్థానిక ప్రజలు, రైతులు, వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, యువత మద్దతు పలుకుతున్నారు. టంగుటూరు మండలం కందులూరులో యాత్రకు ఘనస్వాగతం లభించింది. దారి వెంట బంతిపూలు పరిచి కందులూరు గ్రామస్థులు యాత్రలో పాల్గొంటున్న రైతులు, మహిళల్ని సాదరంగా స్వాగతించారు. దాదాపు కిలోమీటరు మేర పూలు చల్లారు. ముక్తకంఠంతో అమరావతి రైతులకు మద్దతు పలికారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు.
రైతుల మహాపాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి వచ్చి తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాదయాత్రను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతీ గ్రామంలో ప్రజలు మహాపాదయాత్రకు ఘనంగా స్వాగతం పలుకుతున్నది ప్రభుత్వం చూడాలని, ఈ సందర్భంగానైనా ప్రభుత్వం పునరాలోచన చేసి తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బాలవీరాంజనేయస్వామి విజ్ఞప్తి చేశారు.
ఇలాఉండగా, 12 వ రోజున యరజర్లకు చేరుకున్న పాదయాత్రి అక్కడ రాత్రి బస చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యలో మరుసటి రోజు శనివారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. అమరావతి రైతు మహా పాదయాత్ర ఇప్పటివరకు 152.59 కిలోమీటర్ల మేర కొనసాగింది.
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..