అమరావతి: ప్రస్తుత ఆర్థికసంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2021-22 సంవత్సరానికి సుమారు రూ.2.30 లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించింది. ఇవాళ ఒక్కరోజే నిర్వహించనున్న శాసనసభ, మండలి సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను సమర్పించనున్నారు. రెండేండ్లుగా ప్రభుత్వం కొనసాగిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే దాదాపు రూ.40 వేల కోట్ల వరకు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమచేసే పథకాల బడ్జెట్లో ప్రాథాన్యమివ్వనున్నారు. సామాజిక పింఛన్ను వచ్చే ఏడాది జనవరి నుంచి రూ.2,250 నుంచి రూ.2500కు పెంచనున్నారు. దీంతో గతంతో పోలిస్తే సంక్షేమ పథకాల వాటా అధికమయ్యే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి