Ramana Dikshitulu | తిరుమలలో పరిస్థితులపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమలలో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుమలలో ఆగమ శాస్త్ర నియమాలను పాటించడం లేదని రమణ దీక్షితులు తెలిపారు. శాస్త్ర నియమాలను పూర్తిగా విస్మరించి పనిచేస్తున్నారని ఆరోపించారు. సొంత ప్రణాళిక ప్రకారమే టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధనిక భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. వీఐపీల సేవలోనే అధికారులు తరిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో తన ఆవేదనను రమణ దీక్షితులు రాసుకొచ్చారు. అయితే కొద్దిసేపటికే ఈ ట్వీట్ను రమణ దీక్షితులు డిలీట్ చేయడం గమనార్హం. ఇలా టీటీడీపై రమణ దీక్షితులు విమర్శలు చేయడం ఇదే కొత్తేమీ కాదు. అనేక సందర్భాల్లో టీటీడీ నిర్ణయాలను తప్పుబడుతూ ఆయన వార్తల్లో నిలిచారు.