యాదాద్రి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ తిరుమల, తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో సీఎం కేసీఆర్ న భూతో న భవిష్యత్తు అన్న చందంగా యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొ్న్నారు. దేవాలయం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతంగా ఉందని, నిర్మాణ కౌశల్యం భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహ స్వామి ని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.