selfie | సెల్ఫీల పిచ్చితో ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. అయినా కొంతమంది మారట్లేదు. ప్రాణాలను రిస్క్లో పెట్టి మరి ఫొటోల కోసం ట్రై చేస్తున్నారు.. చివరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాగే మెడలో పామును వేసుకుని శివుడిలా ఫోజిద్దామని ట్రై చేసి ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. తాళ్లూరుకు చెందిన మణికంఠ రెడ్డి కందుకూరులో జ్యూస్ స్టాల్ నడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం అక్కడికి పాములు ఆడించే వ్యక్తి రావడం మణికంఠ రెడ్డి గమనించాడు. కాసేపు పాముల ఆట చూసిన మణికంఠ.. దాంతో సెల్ఫీ దిగాలని అనుకున్నాడు. ఇదే విషయం పాములు ఆడించే వ్యక్తికి చెప్పి.. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. మామూలుగా పాముతో సెల్ఫీ అంటేనే ప్రాణ సంకటం.. అలాంటిది మణికంఠ రెడ్డి అంతకు మించి రిస్క్ చేశాడు. మెడలో పామును వేసుకుని శివుడిలా ఫొటోకు ఫోజిచ్చాడు. అక్కడి వరకు బాగానే జరిగింది. ఫొటో దిగిన తర్వాత పామును కిందకు దించుతున్న టైమ్లో అది కాటేసింది. దీంతో హుటాహుటిన మణికంఠను ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మణికంఠ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు.
“Google Search | గూగుల్లో ఏదైనా వెతికేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి”
AP News | వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని.. మోసపోయిన బీటెక్ విద్యార్థిని