పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి
కూసుమంచి, ఏప్రిల్ 4: పాలేరు నియోజకవర్గంలో రూ.22.08 కోట్లతో రెండు రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే’తో మాట్లాడుతూ.. ప్రజలకు మౌలిక వసతులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తానన్నారు. మండలంలోని చౌటపల్లి నుంచి తిరుమలాయపాలెం మండలం జూపెడ, రాజారం, వయా పైనంపల్లి వరకు 10.10 కి.మీ రోడ్లు రూ.9.05 కోట్లు, నేలకొండపల్లి మండలం కోనాయగూడెం నుంచి నాచేపల్లి వయా ఆరెగూడెం, గువ్వలగూడెం, ముజ్జుగూడెం, అనాసాగరం వరకు 17.18 కి.మీ రోడ్లకు రూ.13.03 కోట్లు మంజూరయ్యాయన్నారు. రోడ్ల నిర్మాణంపై నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ను కోరిన వెంటనే స్పందించారన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ద్వారా నిధులు విడుదల చేయించారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పల్లెల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తుందన్నారు. అభివృద్ధి పనులతో పల్లెలు కళకళలాడుతున్నాయని అన్నారు. ‘పల్లె ప్రగతి’కి 12 అవార్డులు రావడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు.
ఇవి కూడా చూడండి..
తమిళనాడులో భారీగా నగదు పట్టివేత
ఛత్తీస్గఢ్ నక్సల్స్ దాడిలో 14కు చేరిన మృతుల సంఖ్య..!