చెన్నై : తమిళనాడు ఎన్నికల్లో భారీగా నగదు చేతులు మారుతుండగా.. మద్యం ఏరులై పారుతోంది. ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూ.. మరో వైపు ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు, పెద్ద ఎత్తున మద్యాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సైదాపేట, థౌజండ్ లైల్స్ నియోజకవర్గాలు నగదు సీజ్ చేశారు.
సైదాపేట్లో రూ.1.3కోట్లు, థౌజండ్స్ లైట్స్ నియోజకవర్గంలో రూ.1.23 కోట్లు పట్టుకున్నారు. అలాగే కంచీపురంలో నగదు, ఓటరు జాబితాతో ఉన్న నలుగురిని అరెస్టు చేశారు. తుత్తుకుడిలో 312 మద్యం సీసాలు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఈ నెల 6న పోలింగ్ జరుగనుంది.