(Covid @ AP) విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 186 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. శుక్రవారం కంటే 48 కేసులు పెరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 32 మంది, కృష్ణా జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 26 మందికి కరోనా వైరస్ సోకింది. కొవిడ్ నుంచి నిన్న 191 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,576 కి చేరింది. వీరిలో 20,56,979 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్న కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించటంతో.. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 14,448కి చేరింది. శుక్రవారం వరకు 3,05,39,041మంది శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..