రెబ్బెన : రెబ్బెన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం కేంద్ర వైద్య బృందం సందర్శించింది. సీనియర్ రిజియన్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, సెంట్రల్ మెడికల్ అధికారి డాక్టర్ రవిచంద్ర దవాఖానను సందర్శించిన వారిలో ఉన్నారు. దవాఖాన పరిసరాలు, గదులు, వార్డులు పరిశీలించిన అనంతరం దవాఖాన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల అమలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. లెప్రసీ, టీబీ, ఎన్సీడీ, ఎన్వీబీడీసీపీ కింద మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా కార్యక్రమాలపై అవగాహన, పనితీరుపై ఆరాతీశారు. జేఎస్వైకే కింద ఆర్థిక వనరులు, వాటి నెలవారీ వినియోగం. మాతా, శిశు సంరక్షణ కింద తల్లీబిడ్డల ఆరోగ్యం గురించి అవగాహన ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు.
వైద్య సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, దవాఖానకు వచ్చే రోగులకు అసౌకర్యాలు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎంఅండ్హెచ్వో డాక్టర్ మనోహర్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ సుధాకర్నాయక్, పీవో ఎంసీహెచ్అండ్ఎన్సీడీ డాక్టర్ ప్రేంసాగర్, డీఐవో డాక్టర్ సునీల్రావు, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ భరత్, ఫార్మాసిస్ట్ అజ్మీరాసందీప్, సిబ్బంది ప్రవీణ్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.