బెల్లంపల్లి, మే 9 : ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కాం టా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి మాట్లాడారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం లెక్కకు మించి పథకాలు తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. తెలంగాణ ను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, ఈ ఎన్నికల్లో కారు గుర్తు కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లిలో సింగరేణి స్థలాలకు ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి వలస నాయకులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు పట్టణంలోని ఏఎంసీ ఏరియాలో కొప్పుల ఈశ్వర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలి సి మాట్లాడారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ శాంతిఖని గని పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్ రాజనాల కమల, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్ధంశెట్టి సాజన్, సబ్బని కృష్ణ, నూనెటి సత్యనారాయణ పాల్గొన్నారు.
కన్నెపల్లి, మే 9 : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ వేలకోట్లున్న శ్రీమంతునికి, కార్మికుడి బిడ్డకు మధ్య పోటీ జరుగుతుందని, ప్రజలు ఎవరివైపు ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్నెపల్లి జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరంజన్ గుప్తా, మాజీ సర్పంచు అశోక్గౌడ్, నాయకులు జిల్లెల్ల మహేశ్గౌడ్, బేర సురేశ్ పాల్గొన్నారు.
కాసిపేట, మే 9 : సింగరేణి కార్మికుడిగా అనేక పోరాటాలు చేసి జైలుకెళ్లానని, ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పార్లమెంట్లో కార్మిక గొంతునై సమస్యలను ప్రస్తావిస్తానని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. గురువారం మందమర్రి ఏరియాలోని కాసిపేట 1వ గని, 2 ఇైంక్లెన్ గునులపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. కార్మికులను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ డబ్బులతో ఓట్లు కొనేవారు వస్తున్నారని, వారికి బుద్ధి చెప్పి ప్రజల పక్షాన ఉండే బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని కోరారు. టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల సంపత్, ఏరియా కార్యదర్శి వొడ్నాల రాజన్న, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, పిట్ కార్యదర్శి బైరి శంకర్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, నాయకులు రమణ, దుగుట శ్రీనివాస్, సారంగపాణి, దాసరి శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మందమర్రి ఏరియాలోని కాసిపేట 2 ఇైంక్లెన్ గనికి చెందిన ఐఎన్టీయూసీ ముఖ్య నేతలు టీబీజీకేఎస్లో చేరారు. ఇటీవల బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో ఐఎన్టీయూసీలో చేరిన టీబీజీకేఎస్ మాజీ పిట్ సెక్రటరీ కారుకూరి తిరుపతి, మైన్స్ కమిటీ సభ్యుడు కొత్తపల్లి ఉద య్ తదితరులు తిరిగి సొంతగూటికి వచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో చేరారు. బీఆర్ఎస్ ఎంపీ కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మె జార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బడికల సంపత్, ఏరియా నాయకులు రమణ, దుగుట శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, రమేశ్ , సారంగపాణి పాల్గొన్నారు.