చెన్నూర్, మే 9 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం చెన్నూర్కు రానున్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే బహిరంగ సభా స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గురువారం పరిశీలించారు.
కేటీఆర్ హెలిక్యాప్టర్లో ఉదయం 11 గంటలకు చెన్నూర్కు చేరుకొని… మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేస్తారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై కేటీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బాల్క సుమన్ కోరారు.