Basara IIIT | బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని మల్లిపూడి తేజస్విని మృతిపై తోటి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. వీసీ రావాలంటూ ఆయన గెస్ట్హౌస్ వద్ద నినాదాలు చేశారు. రాత్రంతా గెస్ట్హౌస్ గేటు ముందే నిద్రించారు.
మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని, క్యాంపస్లో వైద్య సదుపాయాలు, రోగ నిర్ధారణ పరికరాలను తక్షణమే అప్గ్రేడ్ చేయాలని.. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా సరైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తాము వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం లేదని.. జవాబుదారీతనం, విద్యార్థుల భద్రత కావాలని మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ సీఎస్వో ఓఎస్డీ తమను వేధిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్కు చేరుకున్నారు.