భైంసా, ఫిబ్రవరి 8 : టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు సీఎం కేసీఆర్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్లో సీఎంను మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. నమ్మకాన్ని నిలబెడుతానని, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహాకారంతో పార్టీని బలోపేతం చేస్తానని సీఎంకు మాట ఇచ్చినట్టు తెలిపారు. తన వెంట డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ లోక భూమరెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉన్నారు.