నిర్మల్ టౌన్: 41(ఎ) సీఆర్పీసీని రద్దు చేయాలని కోరుతూ నిర్మల్ బార్కు చెందిన న్యాయవాదులు గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ. రమణకు ఉత్తరాలు రాశారు. ఏడు సంవత్సరాల కాలం వరకు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల్లో ఇవ్వదలచిన 41(ఎ) సీఆర్పీసీ నోటీసు దుర్వినియోగమవతుందని వారు పేర్కొన్నారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులకు నాన్బెయిలబుల్ నేరాలతో జైలుకు వెళ్లి న్యాయవాదులు ఇచ్చే బెయిల్పై బయటకు వచ్చే విధానంలో నేరాస్తుల్లో చట్టాలపై గౌరవం ఉండేదని వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం 41(ఎ) సీఆర్పీసీ నోటీసు కారణంగా పోలీసులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు లేఖలో పేర్కొన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ ప్రత్యేక దృష్టి పెట్టి 41(ఎ) సీఆర్పీసీ రద్దు చేసేలా చూడాలని న్యాయవాదులు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగాగౌడ్, నాయకులు సురేశ్, రమణగౌడ్, అశోక్, శ్రీనివాస్రెడ్డి, రమణ, ఆసిఫ్అలీ, మధుకర్రాజు, శైలజ, సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
.