అదిలాబాద్ : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమందికి మేలు జరిగిందన్నారు.
చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారందరికి ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం చేసి అండగా ఉన్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.