బెల్లంపల్లి పట్టణంలో రెండు ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కంపెనీలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ప్రపంచస్థాయి సంస్థలతో పలు ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తూ ఔరా అనిపిస్తున్నాయి. మొన్న బెల్లంపల్లి వచ్చిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆ సంస్థలను మెచ్చుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా కేటీఆర్ యూఎస్ పర్యటనలోనూ మన ఐటీ కంపెనీల గురించి ప్రస్తావించడంతో బెల్లంపల్లి పేరు పరాయిదేశంలో మార్మోగిపోతున్నది. ఫ్రాన్స్, హాంగ్కాంగ్, కెనడా, యూకే, యూఎస్, బంగ్లాదేశ్ లాంటి దేశాలతోపాటు, బెంగళూర్, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ పట్టణాల నుంచి వందల సంఖ్యలో క్లయింట్స్ను డీల్ చేస్తున్నాయి. మల్టీ నేషనల్ కంపెనీలకు రిక్రూట్మెంట్ సర్వీసెస్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. ఐటీ అంటే గుర్తుకొచ్చే, కావాల్సినన్ని వనరులు ఉండే హైదరాబాద్, బెంగళూర్, చెన్నై లాంటి అగ్రశ్రేణి నగరాలను కాదని ఎలాంటి సదుపాయాలు లేని బెల్లంపల్లి లాంటి మారుమూల పట్టణంలో ఈ సంస్థలు స్థాపించడం వెనుక రెండు కంపెనీలది ఒకటే లక్ష్యం. ఈ కంపెనీల సీఈవోలు బెల్లంపల్లిలో పుట్టి, పెరిగి, ఇక్కడే చదువుకున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోపాటు సొంతూరుకు ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నవారే. అందుకే సాక్షాత్తు కేటీఆరే ఈ సంస్థలను చూసి స్ఫూర్తి పొందారు. ఈ సంస్థలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం..
– మంచిర్యాల ప్రతినిధి, మే 20 (నమస్తే తెలంగాణ)
బెల్లంపల్లి పర్యటనలో..
బెల్లంపల్లి పట్టణంలో రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయంటే నమ్మలేదు. మా ఎమ్మెల్యే చిన్నయ్య నన్ను ఆ కంపెనీల వద్దకు తీసుకెళ్లాడు. వాటిని చూస్తే నాకు ఆశ్చర్యమేసింది. వాటి నుంచి స్ఫూర్తి కూడా కలిగింది. టెక్నాలజీతో ప్రపంచమే కుగ్రామంగా మారుతోందని బెల్లంపల్లి సంస్థలు నిరూపించాయి. ఆ సంస్థలను నడిపిస్తున్న యువకులను తలుచుకుంటే.. వారికున్న టాలెంట్తో ఇప్పటికే లక్షలాది మంది తెలుగు పిల్లల్లా విదేశాలకు వెళ్లి స్థిరపడొచ్చు. కానీ.. ఇక్కడున్న స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. పుట్టిన ఊరుకు ఏదో ఒకటి చేయాలనే తపన చూసి సంతోషించా. రానున్న రోజుల్లో బెల్లంపల్లికి మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయి.
సనాతన ఎనలిటిక్స్ సంస్థ నిర్వాహకులు రంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు ముగ్గురు అన్నదమ్ములు. సూపర్ స్మార్ట్ ఇంజినీర్లు. పుట్టపర్తి సాయి బాబా శిష్యులు. ఆయన స్ఫూర్తితో పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే తపనతో తెలంగాణలోని మారుమూల పట్టణం బెల్లంపల్లిలో ఐటీ సంస్థ పెట్టారు. వాళ్ల నాన్న సింగరేణి ఉద్యోగి. ఎలాంటి ఐటీ టవర్ లేకుండా, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వారిని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా.
మంచిర్యాల ప్రతినిధి, మే 20 (నమస్తే తెలంగాణ) : వాల్యూపిచ్ అనేది బాంబేలో 2006లో స్థాపించబడింది. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన చెన్నమాదవుని వెంకట రమణ, ఆయన భార్య కిరణ్ మృదుల బెల్లంపల్లి వాస్తవ్యులు. కరోనా 2020 ఫస్ట్ లాక్డౌన్లో ఇక్కడికి వచ్చారు. అలా ఇక్కడున్న ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ.. ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు. దీంతో వెంకటరమణ ఫ్రెండ్ సుధాకర్ పేరిట జస్ట్ కాల్ సుధాకర్ అని ఒక యాప్ తీసుకొచ్చారు. ఆన్లైన్ డెలివరీ యాప్ ఇది.. కానీ బెల్లంపల్లి ప్రజల దగ్గర ఆన్లైన్లో షాపింగ్ చేసేంత, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేన్ని డబ్బు లేదు. అప్పుడు వాళ్లకు అర్థమైంది ఏంటంటే బెల్లంపల్లి నుంచి కస్టమర్లు ఉండొద్దు.. కానీ అదే బెల్లంపల్లి నుంచి కస్టమర్లకు సప్లయ్ జరగాలి. అలా ఇక్కడి వారికి ఏమైనా చేయాలనే ఆలోచనల నుంచి ‘గిఫ్ట్ ఏ స్మైల్’ అనే కాన్సెప్ట్ వచ్చింది. దానిపై బాంబేలో రిజిస్ట్రార్ చేయిద్దామనుకున్నాం. కానీ.. అప్పటికే గిఫ్ట్ ఏ స్మైల్ అనేది మంత్రి కేటీఆర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ ఉన్నట్లు తెలిసింది. దీంతో బెల్లంపల్లి అభివృద్ధి సంస్థ(బీఏఎస్) ఫౌండేషన్ పెట్టారు. వేరే కంపెనీలకు ఇక్కడికి తీసుకొచ్చి, స్థానికులకు ఉపాధి చూపించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా కంపెనీలు బెల్లంపల్లికి రావాలంటే ముందు మనం ఒక కంపెనీ పెట్టాలని వాల్యూపిచ్ను బెల్లంపల్లిలో స్థాపించారు. ఇంటి దగ్గర ఉన్న కార్ షెడ్డు నుంచి కంపెనీని మొదలుపెట్టి.. ఈ రోజు 200 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు.
ఆరేండ్ల క్రితమే వచ్చిన మరో సంస్థ..
ఆరేళ్ల బెల్లంపల్లిలో ఉన్న రెండు ఐటీ కంపెనీల్లో సనాతన ఎనలటిక్స్ అండ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ అనే సంస్థ ఆరేండ్ల క్రితమే మొదలైంది. హైదరాబాద్లో శరవేగంగా ఐటీ విస్తరిస్తున్న రోజుల్లోనే అక్కడ చేస్తున్న జాబ్స్ వదిలేసి వచ్చి మరీ ఇక్కడ సంస్థను ప్రారంభించారు. తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో స్కూలింగ్ అంతా ఇక్కడే చేసి, ఇక్కడే స్థిరపడ్డారు. పుట్టి, పెరిగిన బెల్లంపల్లికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రంగనాథరాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు 2017లోనే కంపెనీని స్థాపించారు. ముగ్గురు అన్నదమ్ములు పెద్దాయన ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ, మిగిలిన ఇద్దరూ ఎంబీఏ హెచ్ఆర్, మార్కెటింగ్ చేశారు. రంగనాథరాజు పదో తరగతి పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఇంటర్, డిగ్రీ, ఎంఏ, ఎంబీఏ పూర్తి చేశాడు. సాయిబాబా శిష్యుడిగా సొంత ఊరిలోనే ఉండాలి. నలుగురుకు ఉపయోపడే పని చేయాలనే తపనతోనే తామంతా కలిసి ఈ కంపెనీని స్థాపించామని చెబుతున్నారు.
1000 మందికి ఉద్యోగాలిస్తాం..
మా సంస్థ ద్వారా బెల్లంపల్లితోపాటు మంచిర్యాల జిల్లాకు చెందిన 1000 మందికి ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం. మంత్రి కేటీఆర్ రాకతో మా గురించి అందరికీ తెలిసింది. మా టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. త్వరలోనే నిరుద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తాం. డిగ్రీ పూర్తి చేసిన ఎవరైనా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు మా దగ్గర ఐటీ జాబ్ చేయొచ్చు. అలా వారిని ట్రెయిన్ చేస్తాం. 1000 మందికి ఉద్యోగాలే నా దృష్టిలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ అని అప్పుడు సగర్వంగా అనౌన్స్ చేస్తా.
– వెంకటరమణ, ఆయన భార్య కిరణ్ మృదుల, సీఈవో, వ్యాల్యూపిచ్.
ప్రస్తానం ఇలా..
వ్యాల్యూపిచ్ ప్రారంభించక ముందు 50 మందికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే అందులో 25 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు ఓ ప్రైవేట్ కాలేజీ బిల్డింగ్ దొరికింది. అలా 2022 నవంబర్ 2వ తేదీన పూజ, ప్రారంభోత్సవం లేకుండా వచ్చిన వారికి మూడు గదుల్లో ట్రేయినింగ్ ఇవ్వడంతో సంస్థ మొదలైంది. డిసెంబర్ చివరి వారంలో బాంబే నుంచి నిపుణులను తీసుకొచ్చి డిజిటల్ మార్కెటింగ్, సాప్ట్వేర్ టెస్టింగ్ శిక్షణ ఇచ్చారు. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్ ప్రయత్నం చేసినా అవి వర్కవుట్ కాలేదు. కానీ.. సాప్ట్వేర్ టెస్టింగ్ మాత్రం సక్సెస్ అయ్యింది. తొలిరోజుల్లో కస్టమర్లకు ప్రపోజల్స్ ఇస్తే వాళ్లు కన్ప్యూజ్ అయ్యేటోళ్లు. చివరకు ఎడ్యూఫండ్ అనే ఫస్ట్ కస్టమర్ వచ్చారు. చాలా విజయవంతంగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయడంతో లాక్డౌన్ తరువాత వెల్లువగా కస్టమర్లు రావడం మొదలైంది. ఓలా, ఊబర్, స్విగ్గి, జొమాటో, ఓయో, ఫ్లిప్కార్ట్, టీసీఎస్, విప్రో, ఎయిర్పోర్ట్స్ అన్ని వాల్యూపిచ్ కస్టమర్లుగా మారిపోయారు. ట్యాగ్స్ 24(సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ పాజిటివా, నెగెటివా, న్యూట్రల్లా గుర్తించి ట్యాగింగ్ చేయడం దీని పని, న్యూస్ వెరిఫికేషన్ పర్పస్లోనూ ఉపయోగపడుతుంది), వెరిఫై 24/7 (పెద్ద పెద్ద కంపెనీల్లో హెచ్ఆర్ క్రిమినల్ చెక్స్, బ్యాంక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఉపయోగపడుతుంది, కోర్టు కేసులకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది), కోర్ట్ చెక్కర్ (ఇది కేవలం పోలీసులకు మాత్రమే, ఇందులోనే ఫేస్ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు సెల్ఫోన్ రికార్డింగ్స్ ద్వారా వెంటనే నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. హ్యాండ్ రైడ్ వెర్షన్లోనూ అందుబాటులో ఉన్న ఈ యాప్ను ఇప్పటికే లక్ష మంది వరకు డౌన్లోడ్ చేసుకున్నారు), బీ టూబీ టెస్టర్స్ (సాప్ట్వేర్ సరిగా పని చేస్తుందా లేదా అని చెక్ చేస్తున్నది). ఈ ప్రాజెక్టుల ద్వారా వందల మంది క్లయింగ్స్ను బెల్లంపల్లి నుంచి ఈ సంస్థ డీల్ చేస్తున్నది.
మూడు రంగాల్లో సేవలు
సనాతన ఎనలటిక్స్ అండ్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ సంస్థ ఎకనామిక్ రీసెర్చ్, రిక్రూట్మెంట్ సర్వీస్, రీటేయిల్స్ మూడు రంగాల్లో సేవలు అందిస్తున్నది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అపెక్స్ బాడీ ఎస్ఐఏఎం(సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానిఫ్యాక్చర్స్), టీవీఎస్ మోటార్, సుందరం క్లేటన్, సుందరం ఆటో కాంపోనెంట్ లిమిటెడ్, టీవీఎస్ క్రెడిట్ లాంటి కార్పొరేట్ సంస్థలకు ఎకనామిక్ రీసెర్చ్ చేసి పెడుతున్నది. ప్రస్తుత మార్కెట్ ఎలా ఉంది. భవిష్యత్లో ఎలా ఉంటుందని అంచనా వేసి, నివేదికల రూపంలో ఆయా కంపెనీలకు అందించే కీలక బాధ్యతను కొన్నేళ్లుగా సనాతన ఎనలటిక్స్ విజయవంతంగా నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ ఏడీబీ, ఎస్ఎన్పీ గ్లోబల్, సర్వీస్ నౌ, టెక్ మహేంద్ర, మెగాసాఫ్ట్, టీఏ డిజిటల్ ఇలా మొత్తంగా 45 సంస్థల అవసరాలను తీరుస్తూ సత్తా చాటుతోంది. మూడోదైన రీటేయిల్స్లో షాప్స్ అండ్ మీ అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. బెల్లంపల్లి చుట్టు పక్కల గ్రామాల నుంచి సామగ్రి కొనుగోలు చేసేందుకు చాలా మంది వస్తుంటారు. వారి వ్యయప్రయాసలు తగ్గించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ షాప్స్ అండ్ మీకి మంచి స్పందన లభిస్తున్నది. ఇంటి సామగ్రి, ఫుడ్ ఆర్డర్ ఏదైనా చేసుకునేందుకు ఇందులో ఆప్షన్ ఉంది. మార్కెట్లో ఉన్న ధరలకు ట్రావెల్ ఛార్జి యాడ్ చేసి పూర్తి సేవా భావంతో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. కొవిడ్ టైంలో సనాతన టీం చేసిన వర్క్ అద్భుతమనే చెప్పొచ్చు.
టైర్-3, టైర్-4 నగరాలకు విస్తరణ..
సనాతన కంపెనీకి చెందిన ఈ షాప్స్ అండ్ మీ కాన్సెప్ట్ను రాష్ట్రంలోని మిగిలిన టైర్-3, టైర్-4 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో విస్తరించనున్నారు. అది సక్సెస్ అయితే మిగిలిన చోట్లకు విస్తరించి వందల మందికి ఉపాధి కల్పించగలమని కంపెనీ సీఈవోలు అంటున్నారు. ప్రస్తుతం బెల్లంపల్లిలో 100 మందికి ఉద్యోగాలిచ్చారు. వీరంతా స్థానికులే కావడం గమనార్హం. వచ్చే నెలలో ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించి బెల్లంపల్లి కంపెనీలో మ్యాన్ పవర్ను కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
IT and Industries Minister @KTRBRS visited offices of IT companies @valuepitch and Sanathana Analytics and Recruitment Services located in Bellampalli and interacted with the employees there.
The Minister said that he was impressed that two IT companies are functioning in… pic.twitter.com/zNJXwPtBOo
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 8, 2023