దండేపల్లి, ఏప్రిల్29 : మండలంలోని గూడెం చెక్పోస్ట్ వద్ద సోమవారం ఎస్ఐ ఎల్.భూమేశ్, ఎస్ఎస్టీం ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు.
గూడెం చెక్పోస్ట్ వద్ద రాయపట్నం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న బొలెరో పికప్, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరి వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ.1,25,200 స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎస్టీం ఇన్చార్జి విజయ్ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.