మంచిర్యాల :
‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ఊరూ, వాడా..పల్లె, పట్నం దద్దరిల్లింది.
సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా జిల్లాలోని కన్నెపల్లి మండలం నాయకునిపేటలో పొలం పనులు చేస్తున్న రైతులు, రైతుకూలీలు సరిగ్గా 11.30 గంటలకు తమ పనులు ఆపి సామూహిక గీతాలాపనలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు.