మంచిర్యాల: జిల్లాలోని రామకృష్ణాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందారు. ఏరియా ఆసుపత్రి వెనుకాల ఉన్న మెయిన్ రోడ్పై అతివేగంగా వెళ్తున్న కారు.. బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందారు. చనిపోయినవారు గోదావరిఖనికి చెందిన వీరస్వామి, లక్ష్మిగా గుర్తించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.