మంచిర్యాల : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. పలుచోట్లరోడ్లు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చెన్నూర్ మండలం అక్కెపల్లి సమీపంలో ఉన్న బతుకమ్మ వాగు బ్రిడ్జి రోడ్డు వాగు ప్రవాహానికి కోతకు గురైంది. దీంతో పోలీసులు బ్రిడ్జి మీదుగా రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.