మంచిర్యాల : బొగ్గు గనుల ప్రైవేటీకరణపై సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ శాంతి ఖని గని వద్ద మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానంపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు అవగాహన కల్పించారు.
అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ముకాస్తూ కార్మికుల పొట్టకొడుతున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏరియా సెక్రటరీ రమణ, పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, యువ నాయకుడు ఇరుగు రాల రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.