కాసిపేట, ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండల వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దుకాణ సముదాయాలు, వ్యాపారాలు స్వచ్చందగా బంద్లో పాల్గొనగా విద్యా సంస్థలను బంద్ చేయించారు.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా చేపడుతున్న బంద్కు ప్రజలు స్వచ్చందంగా సహకరిస్తున్నారని, ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కాసిపేట గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య, నిచ్చకోళ్ల శంకర్, మాజీ ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షులు మారం మహేందర్, మోటూరి వేణు, అక్కపెల్లి శ్రీనివాస్, సత్రవేణి మల్లేష్, బన్న శ్రీనివాస్, ఉదయ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.