మంచిర్యాల ఏసీసీ, జనవరి 13 : ఈ నెల18 నుంచి ప్రారంభం కానున్న రెండోవిడుత కంటివెలుగుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, నోడల్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొనేలా వారికి ఆహ్వాన పత్రాలు అందించాలని, 18 ఏళ్ల పైబడిన వారి వివరాల జాబితాను గ్రామ పంచాయతీల్లో పంచాయతీరాజ్ ద్వారా, మున్సిపల్ వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా తయారు చేయించాలన్నారు. గ్రామాలు, వా ర్డుల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహించే తేదీ, సమయం వివరాలతో ఇంటింటికీ ఆహ్వాన పత్రా న్ని అందించాలని ఆదేశించారు.
శిబిరాల్లో టెం టు, 5 టేబుళ్లు, తాగునీరు, మూత్రశాలలు ఇతరత్రా సౌకర్యాలు కల్పించాలని, ప్రతి రోజూ ఉద యం తప్పనిసరిగా పరిసరాలను శుభ్రపర్చాలని, పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికి ప్రత్యేకాధికారిని నియమించాలని, ఆశ, ఆరోగ్య కార్యకర్తలకు కార్యక్రమంపై శిక్షణ అందించి, ఈ నెల 16వ తేదీన మాక్డ్రిల్ చేయించాలని సూచించారు. అన్ని ప్రధాన కూడళ్లు, అంగడీ బజార్లు, దుకాణాల వద్ద ప్రజలకు తెలిసేలా ప్రచారం బ్యానర్లను కట్టాలన్నారు. శిబిరానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని తన చాంబర్లో జిల్లా అధికారులతో కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో 40 బృందాలతో పాటు 2 అదనపు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం అందించిన 10 రకాల ప్రచార సామగ్రిని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించామని తెలిపారు.
జిల్లాలోని 310 గ్రామపంచాయతీలు, 174 వార్డుల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాహుల్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, నోడల్ అధికారి డా ఫయాజ్, కంటి వైద్య నిపుణులు డా సరిత, జిల్లా మాస్మీడియా అధికారి బుక వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నిషేధిత మాదక ద్రవ్యాలు విక్రయిస్తే కఠిన చర్య లు తీసుకోవాలని కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ని ర్మూలనకు చేపట్టనున్న కార్యక్రమాల కార్యచరణ సిద్ధం చేసి ఈ నెల 16 లోగా అందించాలని ఆదేశించారు. మా దక ద్రవ్యాల వినియోగం వలన క లిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలపై విస్తృత ప్రచా రం నిర్వహించాలని, బానిసైన వారిని గుర్తించి రీ-హాబిటేషన్ కేం ద్రాలకు పంపించాలని సూచించారు. జిల్లాకు సరఫరా కాకుండా పకడ్బందీ ని ఘా పెట్టాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో వైన్ షాపులు లేకుండా చూ డాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య, మంచిర్యాల సీఐ నారాయణ నాయక్, ఆబారీ శాఖ ప ర్యవేక్షకులు, సీడబ్ల్యూసీ చైర్మన్ వహీద్, సభ్యులు అనిల్, డీసీపీవో ఆనంద్, విద్యాశాఖ అధికారి సర్దార్ అలీఖాన్, డ్రగ్ ఇన్స్పెక్టర్, పోలీసు శాఖ అధికారులు, డీసీపీయూ సి బ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సమన్వయంతో విజయవంతం చేయాలి
రెండో విడుత కంటివెలుగును విజయవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి కంటి వైద్యులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటి వెలుగు నిర్వహణకు 26 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కంటి పరీక్షలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏ ర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వ రకు పరీక్షలు నిర్వహించాలని, సంబంధిత ఫొ టోలను గ్రూపులో అప్లోడ్ చేయాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. కార్యక్రమం విజయవంతానికి మండల ప్రత్యేకాధికారులు, జిల్లాస్థాయి అధికారులను ఒకొక బృందానికి నియమించామని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వోలు సుధాకర్ నా యక్, సీతారాం, వైద్యాధికారులు, సూపర్వైజ ర్లు, అధికారులు పాల్గొన్నారు.