మంచిర్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎమ్మెల్యే సుమన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో భీమారం మండలం బీజేవైఎం అధ్యక్షుడు వడ్లకొండ పవన్, కాంగ్రెస్ నాయకులు గోదారి ప్రభాకర్, జై భీమ్ సేన అధ్యక్షుడు సాగర్ (బబ్లు) ఉన్నారు.
కార్యక్రమంలో రైతు బంధు కో ఆర్డినేటర్ కలగూరు రాజకుమార్, భీమారం సర్పంచ్ గద్దె రామిరెడ్డి, జాలంపల్లి సమ్మయ్య, రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్, మాజీ ఎంపీటీసీ జనంపల్లి తిరుపతి, మండలం నాయకులు వీరగోని రమేశ్ గౌడ్, భూక్యా లక్ష్మణ్ నాయక్, పోడేటి రవి నాయక్, నాయకులు పాల్గొన్నారు.